హైదరాబాద్లో చేప మందు పంపిణీ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన చేప మందు ప్రసాదం పంపిణీ ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమైంది. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్లో చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేప ప్రసాదాన్ని తీసుకున్నారు. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప మందు వేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.