Home Page SliderNational

హీటర్‌లో మంటలు.. తండ్రి, 3 నెలల కూతురు సజీవ దహనం

Share with

రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. రూమ్ హీటర్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగడంతో తండ్రి దీపక్ యాదవ్, 3 నెలల కూతురు నిషిక సజీవ దహనమయ్యారు. దీపక్ భార్య సంజు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. కాగా, చలికాలంలో రూమ్ హీటర్లను వాడడానికి ముందు టెక్నీషియన్లతో చెక్ చేయించుకోవాలని, అన్ని బావుంటేనే హీటర్లను ఓల్టేజీ హెచ్చు-తగ్గులు లేకుండా చూసి, ఇంజినీర్లతో చెక్ చేయించుకోవాలని వారి సూచనల మేరకు వాడాలి.