Home Page SliderNational

తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం -ఐదుగురు మృతి, 70 మందికి గాయాలు

Share with

తమిళనాడులోని కడలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కడలూర్ నుండి వెళ్లుతున్న బస్సు ముందరిటైరు పేలిపోయింది. దీనితో బస్సు అదుపుతప్పి, ఎదురుగా  కడలూర్ వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వెంటనే మృత్యువాత పడ్డారు. 70 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.