Home Page SliderTelangana

ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం -కుప్పకూలిన ఫ్లైఓవర్

Share with

ఎల్బీనగర్‌లోని సాగర్ రింగ్ రోడ్ కూడలి వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్ ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ దుర్ఘటన ఈ తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ శబ్దానికి అందరూ కకావికలై పారిపోయారు. అయితే కొందరు ఈ ప్లైఓవర్ కింద ఉండడం వల్ల తీవ్రగాయాల పాలయ్యారు. వీరు నిర్మాణ కార్మికులుగా గుర్తించారు. ఈ నిర్మాణ కార్మికులు యూపీ, బీహార్‌క్ చెందిన వారు. స్థానికులు హుటాహుటిన వారిని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మూడు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రమాదంపై కేసు నమోదు చేసామని ఏసీపీ తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కూడా ఈ ఘటనపై కమిటీ వేసి, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.