Andhra PradeshHome Page Slider

హైటెక్ పద్దతిలో నకిలీ సర్టిఫికేట్ల దందా

Share with

ఏళ్ల తరబడి కష్టపడి డిగ్రీలు చదవనక్కరలేకుండా ఈజీగా డిగ్రీ కావాలా ? చదువు కొనాలనుకుంటున్నారా?  అయితే ఈ ముఠా బాగా సహకరిస్తుంది. తిరుపతికి చెందిన తులసిరామ్ అనేవ్యక్తి బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ఎంబియే డిగ్రీ కావాలంటే కేవలం 3 లక్షలే. ఏరియా వైజ్‌గా, యూనివర్సిటీల వైజ్‌గా, ఈ రేట్లు ఉంటాయి. ముందుగా అడ్వాన్సు తీసుకుని, సర్టిఫికేట్లను వాట్సాప్‌లో పంపుతారట. తర్వాత పూర్తి పేమెంట్ అందిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లను అందజేస్తారు. ఇదంతా పక్కాగా ఓ పద్దతిలో జరిగిపోతుందని హామీ ఇస్తున్నాడు తులసిరామ్. తనకు టీమ్ ఉందని, ఫ్రొఫెసర్స్‌తో లింకులు ఉన్నాయని వెల్లడి చేశాడు. 75 లక్షలకు ఎంబిబియస్‌ సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. ఇక బీటెక్, డిగ్రీలు, ఎంబియే సర్టిఫికేట్లు ఈజీగా 3 లక్షలకే దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ సర్టిఫికేట్లు పనికొస్తాయట. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయనక్కరలేదు. రెగ్యులర్, డిస్టెన్స్ వంటి ఎలాంటి డిగ్రీలైనా వీరు అవలీలగా సంపాదించేస్తారట. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.