Andhra PradeshHome Page Slider

రాజకీయాల్లో చచ్చినా సరే కాపు సామాజిక వర్గాన్ని విమర్శించను:కొడాలి నాని

Share with

తాను కాపు సామాజిక వర్గాన్ని విమర్శించినట్లు వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కొడాలి నాని మాట్లాడుతూ..రెండు దశాబ్దాల తన రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగం అని అన్నారు. ఐటీడీపీ కట్ లు, పేస్ట్ లు చేసి వదిలినా వీడియోపై జనసేన సైనికులు స్పందించిన నేపథ్యంలో కొడాలి నాని వివరణ ఇచ్చారు. వంగవీటి రాధా తనకు సొంత తమ్ముడు లాంటివాడని ఆయన పేర్కొన్నారు.అయితే ఎట్టి పరిస్థితిలో అతను గుడివాడలో పోటీ చేయడని,మహానాడు వేదికపై ఎన్టీఆర్ పక్కన పప్పు, తుప్పు ఫోటోల ఏర్పాటుపై తాను స్పందించానన్నారు. ఎన్టీఆర్ వారసుడు బాలయ్య ఫోటో లేకపోయినా అచ్చెం లాంటి స్క్రాప్ నా కొడుకుల ఫోటోలు ఎందుకు పెట్టారని మాత్రమే ప్రశ్నించానన్నారు. టీడీపీ వాళ్లు చూపిన అబద్ధాన్ని కాపు సోదరులు నమ్మలేదన్నారు. రాబోవు రోజుల్లో జనం కూడా టీడిపిని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కొడాలి నాని పేర్కొన్నారు. తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఒక్క కార్యక్రమంలో కూడా తాను పాల్గొనలేదన్నారు. టీడిపి నీచాది నీచులు చేసిన మాయలో పడవద్దని కొడాలి నాని స్పష్టం చేశారు.