Home Page SliderTelangana

యాక్సిడెంట్ స్పాట్‌లో చనిపోయిన వారి పేరెంట్స్‌ని పరామర్శించిన ఈటల:

Share with

 హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన దరుపల్లి మొగిలి (48) ఆయన కొడుకు శివ  (12) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. మానకొండూర్ మండలం రంగపేట స్టేజ్ వద్ద ఆటోను ఇసుక లారీ గుద్దడంతో ప్రమాదం.

అక్రమ ఇసుక రవాణా ప్రాణాలు తీస్తోంది అంటూ రోడ్డుపై ధర్నా. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ఈటల రాజేందర్. కలెక్టర్‌తో మాట్లాడిన ఈటల. తక్షణ సాయం అందించాలని కోరారు. రోజుకు 150 లారీలు తిరుగుతున్నాయి. వెంటనే లారీలను నిలిపివేయాలని డిమాండ్.

కొనసాగితున్న ధర్నా. మానేరు వాగును చెరబట్టారు.

గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు చేయవద్దని ఆదేశించినా, హైకోర్టు స్టే ఇచ్చినా ఆపకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రోడ్డు మీద నిర్లక్ష్యంగా పోసిన మట్టికుప్పలు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలు వేగంగా ఢీ కొట్టడం వల్ల అమాయకులు అయిన ఇద్దరు మరణించారు. ఇసుక మాఫియా కెసిఆర్ చుట్టాలు. వందల లారీల ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. యాక్సిడెంట్ అయ్యి ఇన్ని గంటలు అయినా కూడా ఒక్క అధికారి  కూడా ఇక్కడికి రాలేదు. మానేరును కాపాడుకుంటూ వచ్చా. కెసిఆర్ బందువులు ఇసుక దందా మొదలు పెట్టాక మానేరును రాళ్ళు తేలేలా జేశారు. నీళ్లు లేకుండా చేసి రైతుల పొట్టగొడుతున్నారు. తక్షణమే అక్రమ ఇసుక రవాణా ఆపాలని.. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం