గజ్వేల్-మనోహరాబాద్-కూచారంలలో పాల్గొన్న ఈటల రాజేందర్
సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.
పార్టీలో చేరిన సర్పంచ్ నరేందర్ రెడ్డి, కొండాపూర్ సర్పంచ్ మమత రఘు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు.
మనోహరాబాద్ మండలం బిజెపికి కంచుకోట అవుతుంది. కెసిఆర్ మాటలు చెప్తారు తప్ప పనులు చేయరు. సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోదీ గారు ఇచ్చే డబ్బులతో అవుతోంది. కెసిఆర్ని ఓడగొడితేనే సమస్యలన్నిటికీ పరిష్కారం—ఈటల రాజేందర్