NewsTelangana

 కేసీఆర్ మా జోలికోస్తే ఖబడ్దార్ : ఈటల

Share with

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం తుఫ్రాన్ పేటలో జరిగింది. ఈ ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఈటల మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈటల ఆరోపించారు. అంతేకాకుండా తన భార్య కేసీఆర్ నమ్మక ద్రోహి అని ఎప్పుడో చెప్పిందన్నారు. మనకున్న ఆస్తి అంతా అమ్మి అయిన సరే కేసీఆర్‌తో కొట్లాడమని చెప్పిందన్నారు. నా సతీమణి ఈటల జమున మునుగోడులో ప్రచారానికి వస్తే ఆమెకి ఇక్కడేం పని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడగటం ఏంటన్నారు. ఆమె పుట్టిన గడ్డకి ఆమెను రావొద్దనడం ఏంటని ప్రశ్నించారు. ఆ మట్టిలో పుట్టిన బిడ్డ సొంత ఊరికి రావొద్దనడానికి వీళ్లు ఎవరన్నారు. కానీ ఎక్కడో పుట్టిన కేసీఆర్ మాత్రం ఇక్కడకు వచ్చి ప్రచారం చెయ్యోచ్చా అని ఆయన మండిపడ్డారు.

మా జోలికి వస్తే ఎవరైనా సరే మాడి మసైపోతారని ఈటల హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరైనా ,ఎక్కడైనా ప్రచారం చేసే హక్కు ఎన్నికల సంఘం ఎప్పుడో కల్పించిదన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఉల్లంఘిస్తూ.. పోలీసులు ద్వారా తమను అడ్డుకుంటే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణాలో కేసీఆర్ ఆగడాలు సాగేది 2023 వరకే అని ఈటల తెలిపారు. కేసీఆర్ కింద పనిచేసే బానిసల్లా వ్యవహరించొద్దని అధికారులు, పోలీసులకు ఈటల సూచించారు. కేసీఆర్‌లా పైసలను నమ్ముకోలేదని ధర్మాన్ని మాత్రమే నమ్మి ముందుకెళ్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. మరొకరేమో మోడీ, ఈడీ  తన వెంట్రుక కూడా పీకలేరంటున్నారని… మాట్లాడేటప్పుడు వయస్సును గుర్తుంచుకోవాలని హితవు పలికారు.