Home Page SliderInternational

క్రిస్మస్ గిఫ్ట్ చూసి షాక్ అయిన ఉద్యోగులు

Share with

కంపెనీలు సాధారణంగా క్రిస్మస్‌కు ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్ట్‌లు ఇవ్వడం మామూలే. అయితే, ఒక కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ చూసి, ఉద్యోగులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఉడికించిన ఆలూని ఇచ్చి క్రిస్మస్ పండుగ చేసుకోమన్నారు సదరు కంపెనీ యజమానులు. ప్రిటో పైస్ ఇవ్వాలనుకుని, దాని ధర ఎక్కువ కావడంతో ఆలూతో సరిపెట్టామని పేర్కొన్నారు. అంతేకాదు, ఇది కూడా ఉచితం కాదంట. దీనికి ట్యాక్స్‌గా ఉద్యోగులకు ఇచ్చే తర్వాతి చెక్‌లో డబ్బు కట్ చేసుకుంటారట. అయితే కొందరు అల్పసంతోషులు గత సంవత్సరం కంటే మేలనుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు కేవలం మీటింగ్ మాత్రమే పెట్టి, ఏమీ ఇవ్వలేదట. హతోస్మి…