NationalNews Alert

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ పై ఈడీ జోరు

Share with

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ తన జోరును పెంచింది. ఈరోజు  దేశవ్యాప్తంగా 32 చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది.  హైదరాబాద్ , ఢిల్లీ , లక్నో , గురుగ్రామ్ , బెంగళూరు , చెన్నై తదితర నగరాలలో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అరుణ్ రామచంద్ర పిళ్లై , అభిషేక్ రావు , సృజన్‌రెడ్డి , గండ్ర ప్రేమ్‌సాగర్ వంటి ప్రముఖుల ఇళ్లతో పాటుగా రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలోనూ ఈడీ తనిఖీలకు దిగింది. ఒకే సారి ఇన్ని చోట్ల జరుగుతున్న ఆకస్మిక ఈడీ తనిఖీలు నిర్వహించడంతో మొత్తం వ్యవహారంలో అసలేం జరిగి ఉంటుందన్నపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయ్. లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే ఒక దఫా దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా నివాసంలోనూ, కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.