NewsTelangana

మునుగోడు గడ్డపై గులాబీ జెండా రెపరెపలు

Share with

మునుగోడు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. బీజేపీ నుంచి తుదికంటా గట్టి పోటీని ఎదుర్కొన్న టీఆర్‌ఎస్‌ 11,666 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. కారు స్పీడుకు కమలం కకావిలకమైంది. సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. చివరిదైన 15వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన దూకుడును కనబరిచింది. 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 6612 ఓట్లు, కాంగ్రెస్‌ 5557 ఓట్లు సాధించాయి. ఏడు మండలాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కనబరిచింది. చౌటుప్పల్‌లో మాత్రం కమలం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. 2, 3 రౌండ్లు మినహా మిలిగిన 13 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ దూసుకెళ్లింది. పట్టణ, గ్రామీణ ఓటర్లు గులాబీకే జై కొట్టారు.