Telangana

తెలంగాణాలో ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Share with

తెలంగాణాలో ఈ ఏడాదిలో జరగాల్సిన ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దీని ప్రకారం తెలంగాణాలో మే 7 నుంచి 14 ఎంసెట్ ఎగ్జామ్ జరగనుంది. కాగా మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ,12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మా పరీక్షను అధికారులు నిర్వహించనునన్నారు. దీనితో పాటు తెలంగాణాలో పలు ప్రవేశ పరీక్షలకు కూడా  ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. తెలంగాణాలో మే 18న ఎడ్‌సెట్ , మే 20న ఈసెట్ , మే 25న లాసెట్ , పీజీ ఎల్‌సెట్, మే 26,27న ఐసెట్, మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.