Home Page SliderNews AlertTelangana

కౌన్సిలింగ్‌కు క్యూ కట్టిన మందుబాబులు

Share with

న్యూ ఇయర్‌కు ముందు రోజు మందు తాగి బండ్లు నడిపిన వేలాది మందిని పోలీసులు డ్రంక్‌ ‌అండ్‌ డ్రైవ్‌లో పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారంతా తమ వాహనాల కోసం గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌కి క్యూ కట్టారు. ప్రొసీజర్‌ ప్రకారం కౌన్సిలింగ్‌కు కూడా హాజరయ్యారు.  కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ భారీగా కేసులు నమోదయ్యాయి. తాగి వాహనం నడిపిన 3,173 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 1,413, రాచకొండ పరిధిలో 446, సైబరాబాద్‌ పరిధిలో 1,314 కేసులు బుక్‌ అయ్యాయి.