Home Page SliderTelangana

ఢిల్లీలో ఉండొద్దు..గల్లీల్లోనే ఉండాలి:అమిత్ షా

Share with

తెలంగాణాలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించేందుకు పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారు.  ఈ మేరకు తెలంగాణా బీజేపీకి కేంద్రమంత్రి అమిత్ షా ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణాలో  వచ్చే ఎన్నికల్లో 75 సీట్లు గెలిచి తీరాల్సిందేనని  ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎంత పెద్ద లీడర్ అయిన ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని ఆదేశించారు. కాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహ ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలో నిలవాలని అమిత్ షా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణాలో మరో 25-35మంది టాప్ నాయకులను గుర్తించాలని అమిత్ షా బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.