ఫోన్పే, గూగుల్ పే నుండి కరెంటు బిల్లులు చెల్లించొద్దు
విద్యుత్ బిల్లులను ఫోన్పే, గూగుల్ పే నుండి వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించవద్దని తెలంగాణ విద్యుత్ శాఖ ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే వంటి యాప్ల ద్వారా కరెంటు చెల్లింపులు చేయకూడదు. ఈ క్రమంలో టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ల ద్వారానే నెలవారి బిల్లులను చెల్లించాలని వినియోగదారులను కోరింది. దీనిలో పేటీఎం, అమెజాన్ పే ద్వారా కూడా చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.