Home Page SliderNational

వారిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు… ప్రధానిమోదీ

Share with

తన బెంగళూరు పర్యటన విషయంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ఇబ్బంది పెట్టదల్చుకోలేదంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ విమర్శకులకు స్పష్టతనిచ్చారు. మోదీ వారిని ఉద్దేశపూర్వకంగానే ఎయిర్ పోర్టుకు రానివ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలను చంద్రయాన్ 3 విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు మోదీ. శుక్రవారం గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీ నేడు నేరుగా బెంగళూరు వచ్చి, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి నిరంతర కృషికి ఎంతగానో కొనియాడారు. వారికి సెల్యూట్ చేశారు. చంద్రయాన్ 3 పనితీరును ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇలా బెంగళూరుకు వచ్చిన సమయంలో తాను కర్ణాటక సీఎంను ఎందుకు ఎయిర్ పోర్టుకు రావద్దన్నానో వివరణ ఇచ్చారు. తాను బెంగళూరుకు ఏటైమ్‌లో వస్తానో తనకే క్లారిటీ లేదని, సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్‌లను ప్రొటోకాల్ ప్రకారం ఎయిర్ పోర్టుకు రప్పించి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే రావద్దని చెప్పానంటూ తెలియజేశారు ప్రధాని మోదీ.