Home Page SliderNational

దేశంలో నోట్లు రద్దు చేయాలని మోదీకి దేవుడే చెప్పాడా?:రాహుల్ గాంధీ

Share with

నేడు జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కాగా దేశంలో నోట్ల రద్దు,జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. అయితే ఈ జీఎస్టీ వల్ల ప్రజలు,వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారని రాహుల్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో దేశంలోని యువత ఉపాధి కోల్పోయరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తాను దేవుడితో మాట్లాడతానని స్వయంగా చెప్పారన్నారు. అయితే నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే మోదీకి చెప్పారా అని రాహుల్ మండిపడ్డారు. కాగా అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.