కాకినాడలో డయేరియా కలకలం.. 50 మందికి పైగా అస్వస్థత..
ఆంధ్రప్రదేశ్: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆస్పత్రిలో చేరుతున్నారు. కాగా, డయేరియాకు చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందింది. గ్రామంలో పరిస్థితులను డిఎమ్హెచ్ఓ పరిశీలించారు. వాటర్ ట్యాంక్లో నీటిని టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు.