Home Page SliderNational

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ధోని

Share with

 దేశవ్యాప్తంగా ఇప్పుడు ధోని పేరు మారు మ్రోగి పోతుంది. ఎందుకంటే ధోని ఈ IPL  సీజన్‌లో తన ఆటతోనే కాకుండా తన సింప్లీసిటీతోనూ  అందరిని ఆకట్టుకుంటున్నారు. కాగా దేశంలో క్రికెట్ అంటే ఇష్టపడని వాళ్లు కూడా ధోనిని ఇష్టపడతారు. దీంతో భారతదేశంలో ధోనికి విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ ఏర్పడింది. ధోని ఓ కెప్టెన్‌గా,బ్యాట్స్‌మెన్‌గా, బెస్ట్  ఫినిషర్,ఆల్‌రౌండర్‌గా అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ..దేశానికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రికెట్ ట్రోఫీలను అందించారు. అంతేకాకుండా దేశానికి ఎంతో గౌరవాన్ని,హోదాని పెంచే ప్రపంచకప్పును సైతం ధోని సేన 2011 లో దేశానికి అందించిన విషయం తెలిసిందే. ఇంతటి గొప్ప విజయాలను అందించినప్పటికీ ధోని ఎప్పుడూ కూడా గర్వాన్ని ప్రదర్శించపోవడం ఆయన సింప్లసిటీకి నిదర్శనమనే చెప్పాలి. అయితే ఆయన తాజాగా తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. సినీ నటి,BJP నేత ఖుష్బూ అత్తగారిని కలిసిన ధోని ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ఫోటోలను ఖుష్బూ ట్వీట్ చేస్తూ..హీరోలను తయారు చేయలేం.వారు పుడతారు. ధోని అది నిజమని నిరూపించారన్నారు. అయితే ధోని గురించి మాట్లాడటానికి తనకు మాటలు రావడం లేదని ఖుష్బూ తెలిపారు. మా అత్తగారికి 88 ఏళ్లు ఆమెను కలవడానికి ధోని అంగీకరించారు. ఆమెను పలకరించి ,మరిన్ని ఏళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు CSKకు ధన్యవాదాలు అని ఖుష్బూ పేర్కొన్నారు.