Home Page SliderTelangana

ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట ‘లైగర్’ బాధితుల ధర్నా

Share with

ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట ‘లైగర్’ మూవీ నైజాం ఎగ్జిబిటర్స్ ధర్నా మొదలు పెట్టారు. తాము చిన్న చిన్న ఎగ్జిబిటర్లమని, తమను నష్టాలనుండి ఆదుకోమని లైగర్ మూవీ దర్శకుడు పూరీజగన్నాథ్‌ను కోరుకుంటున్నారు. దర్శకుడు పూరీజగన్నాథ్ అట్టహాసంగా పాన్ ఇండియా లెవెల్లో తీసిన లైగర్ సినిమా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. గతంలో కూడా పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయగా వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు దర్శకుడు. కానీ ఇప్పటి వరకూ దాని ఊసే లేదని, తమకు న్యాయం చేయాలంటూ సినీ పెద్దలను వేడుకుంటూ రిలే దీక్షకు దిగారు నైజాం ఎగ్జిబిటర్లు. ఈ సినిమాకు చాలా ప్రమోషన్స్ ఇచ్చారని, దీనితో సినిమా తప్పకుండా హిట్ అవుతుందనుకున్నామని, కానీ తాము దారుణంగా నష్టపోయామంటున్నారు. అప్పట్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ నిజంగా నష్టపోయిన వారికి డబ్బులు ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పటికీ డబ్బు అందలేదని ధర్నాలు చేస్తున్నారు.