Home Page SliderTelangana

ధర్మం, న్యాయం, ఓటర్లే మా దేవుళ్లు: బండి సంజయ్

Share with

కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైందని, రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పోటీ పడుతున్నాయని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లో వివిధ డివిజన్లలో సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారతాయన్నారు. కాంగ్రెస్ ముస్లింలను నమ్ముకుందని, బీఆర్ఎస్ MIMను పట్టుకుని వేళ్లాడుతోందని, వాళ్ల మత గురువులు ప్రచారం చేస్తున్నారని, ఆ రెండు పార్టీలు 12 శాతం ఓట్లపై ఆధారపడ్డాయని విమర్శించారు.