కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి: పురందేశ్వరి
ఏపీ: రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించడం లేదనేది అవాస్తమని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బును తోడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుపై వాస్తవాలు చెప్పేందుకు త్వరలోనే పోలవరంలో పర్యటిస్తామని తెలిపారు.