రోడ్డు పైనే డిప్యూటీ సీఎం ప్రజా దర్బార్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనలో తన మార్క్ను చూపిస్తున్నారు. కాగా ఇవాళ ప్రజా దర్బార్ను పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం బయటే ప్రారంభించారు. రోడ్డుపైనే కుర్చీలు వేసి ప్రజలతో మాట్లాడి వారి అర్జీలు స్వీకరించారు. కాగా అర్జీలపై అప్పటికప్పుడే పవన్ అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.