Home Page SliderNational

పరువు నష్టం కేసులో రాజస్థాన్ సీఎంకు దిల్లీ కోర్టు సమన్లు

Share with

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు మండిపడుతూ ఆయన గెహ్లాట్‌పై పరువు నష్టం దావా వేశారు. సుమారు 900 కోట్ల రూపాయల సంజీవని స్కామ్‌లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు గెహ్లాట్. దీనిపై తన పరువు తీసే వ్యాఖ్యలు చేసారంటూ గెహ్లాట్‌పై కోర్టుకెక్కారు షెకావత్. దీనిపై వివరణ కోరుతూ ఆగస్టు 7న కోర్టుకు హాజరు కావలసిందిగా ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు గెహ్లాట్‌కు సమన్లు పంపింది. ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్ఫాల్ ఈ సమన్లు జారీ చేశారు.