సాగు.. సన్న బియ్యం వైపే ప్రజల మొగ్గు
నిజామాబాద్: జిల్లాలో యాసంగి సాగు జోరందుకుంది. ఇదివరకు రెండో పంటలో రైతులు దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు గతానికి భిన్నంగా సన్నాలకే మొగ్గు చూపుతున్నారు. ఎక్కడో ఒకచోట తప్ప దొడ్డురకం వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం కొనుగోలుదారుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ దృష్ట్యా అన్నదాతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.