ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును శనివారం రాత్రిలోగా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఈ రోజు రాత్రికి నగదును ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బును అందించాలని సీఎస్ స్పష్టం చేశారు. జూలై 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అంతేకాకుండా ఆ రోజే 90% పంపిణీ పూర్తి చేయాలన్నారు. కాగా ఈ పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్ష జరపాలని సీఎస్ నీరభ్ కుమార్ సూచించారు.