వాఘా బార్డర్లో దేశంలోనే పొడవైన 418అడుగుల మువ్వన్నెల జెండా
అమృత్ సర్కు సమీపంలోని అట్టారి-వాఘా బార్డర్ వద్ద దేశంలోనే అతి పొడవైన జెండాను ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 418అడుగులు. పాక్ బార్డర్లో పాకిస్తాన్ జెండా కంటే భారత్ ఎత్తు ఎక్కువగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిని గురువారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖామంత్రి నితిన్ గడ్కరీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లు కలిసి ప్రారంభోత్సవం చేశారు. పాకిస్తాన్ జాతీయ జెండా కంటే దీని ఎత్తు 18 అడుగులు ఎక్కువగా ఉంది. దీనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఏర్పాటు చేశారు.