Home Page SliderNational

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Share with

దాదాపు రెండు,మూడు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా భూతం మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో ఇది క్రమంగా విస్తరిస్తోంది. మన భారతదేశంలో కూడా రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశంలో మరో 918 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,350 కు చేరింది. కాగా కొత్తగా కరోనాతో 4గురు మరణించగా దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,30,806 గా నమోదైంది. రాజస్థాన్‌లో 2,కర్ణాటక,కేరళ రాష్ట్రాలలో చెరొక మరణాలు నమోదయ్యాయి. అయితే మరోపక్క కరోనా నుంచి కోలుకున్న వారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కరోనా విజృంభణను అరికట్టే దిశగా తగు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.