Home Page SliderTelangana

గాంధీ భవన్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ పీఏసీ సమావేశం

Share with

తెలంగాణాలో ఎన్నికల నగారా మ్రోగింది. దీంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ఈ మేరకు తాజాగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఠాక్రే,రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కోమటి రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సిద్ధం చేసిన రూట్ మ్యాప్‌ను నేతలు పరిశీలించారు. కాగా ఈ నెల 16 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.