కర్ణాటక మంత్రికి హైకోర్టులో షాక్
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణపై తాత్కాలిక స్టేను కూడా ఎత్తివేసింది. ఈ మేరకు ఈ కేసుపై 3నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.