Home Page SliderTelangana

తెలంగాణలో సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు

Share with

తెలంగాణ ఎన్నికల వేళ పార్టీల మధ్య పొత్తులు ప్రారంభమయ్యాయి. సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీలు జోరుగా ప్రచారం చేయబోతున్నారు. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడా నియోజక వర్గాలు కేటాయించింది. పాలేరు నుండి తుమ్మల, ఖమ్మం నుండి పొంగులేటి పోటీ చేయనున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెంను పినపాక నుండి బరిలోకి దింపనున్నట్లు సమాచారం.  అలాగే మిర్యాల గూడాలో జానారెడ్డి కుమారుడు రఘువీర్‌కు  టికెట్ లభిస్తుందని ఆశించిన వారి ఆశలపై నీరు జల్లినట్లయ్యింది.