ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి పలు అంశాలపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని పునః సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.