NewsTelangana

నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Share with

ఈ రోజు ఉదయం నుంచి సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన అనేక పరిణామాలకు దారితీసింది. ఈ మేరకు పోలీసులు ఈ పర్యటన నిమిత్తం అనేక ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ విధంగా ఉదయం నుంచి ఎంతో పకడ్బందీగా చేపట్టిన పోలీసుల చర్యలు సఫలమయ్యాయి. ఈ ఉత్కంఠ వాతావరణం నడుమ ఎట్టకేలకు ఆయన నిజామాబాద్ బయలుదేరారు. అంతేకాకుండా ఆయన నిజామాబాద్ చేరుకుని అక్కడ పర్యటనను కూడా మొదలుపెట్టారు. ముందుగా సీఎం కేసీఆర్ నిజామాబాద్‌ సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిజామాబాద్‌లో  టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించారు. అక్కడి నుంచి నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.