NewsTelangana

రేపు ఉత్తర ప్రదేశ్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Share with

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు ములాయం సింగ్ యాదవ్ మూడుసార్లు సీఎంగా వ్యవహరించారు. అంతేకాకుండా మూలాయం అనేక పదవులను అధిరోహించి ప్రజల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడ్డారు. ములాయం సింగ్ యాదవ్ తన హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు గొప్ప సేవలందించారు. అటువంటి మహనీయ వ్యక్తి ఈ రోజున తుదిశ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటూ..పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మూలాయం మృతిపట్ల  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ములాయం అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హజరుకానున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లనున్నారు.