ఏపీలో నిలిచిపోయిన ఇళ్లస్థలాల పంపిణీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో కోర్టు కేసులతో కొన్నిచోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా కోర్టు కేసులతో కొన్నిచోట్ల నిలిచిపోయిన ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అయితే ఈ నెలలోనే 29,496 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. తాజాగా నిర్వహించిన గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ధృడసంకల్పంతో పూర్తిచేయాలన్నారు. కాగా ఏపీలో ఇప్పటికే 4.24లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. అయితే ఆగస్టు 1 నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని సీఎం జగన్ అధికారులకు తెలిపారు.