భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు. కాగా ఈ ఎయిర్పోర్ట్ను 4,592 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు జగన్ తెలిపారు. GMR విశాఖ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ఎయిర్పోర్ట్లో 3.8 కిలోమీటర్ల రన్ వేతో పాటు దేశీయ,అంతర్జాతీయ రవాణాకు సహకరించే టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటి దశలోనే ఈ ఎయిర్పోర్ట్ నుంచి 60 లక్షల ప్రయాణికుల రాకపోకలకు వీలుకలుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ ఈ రోజు విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు,ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు.