Andhra PradeshHome Page Slider

ఏపీలో సీఎం జగన్ మరో దోపిడీకి తెర లేపారు:చంద్రబాబు

Share with

ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో కొత్త ప్రాజెక్టుల పేరుతో సీఎం జగన్ మరో దోపిడికి తెర లేపారని చంద్రబాబు ఆరోపించారు. ఓ వైపు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూనే..మరోవైపు మంత్రి పెద్దిరెడ్డికి రూ.600కోట్ల బిల్లులు సెటిల్ చేశారన్నారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే వేరే వాళ్లకు పేరు వస్తుందని వాటిని వదిలేశారన్నారు. ఏపీలో ఉన్న ప్రాజెక్టులను రద్దు చేసి,23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో డ్రామాలాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.