InternationalNews Alert

బాగ్ధాద్‌లో ఘర్షణలు..15 మంది మృతి

Share with

ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్‌ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఇరాక్ భద్రతా దళాలు,శక్తివంతమైన షియా మత పెద్ద మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. తుపాకీలతో కాల్పుల మోత మోగించారు. ఈ ఘర్షణలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే సదర్ మద్దతుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేయడంతో చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్‌ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ మద్దతుదారులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు అధికారులు గానీ కాల్పులు జరపకుండా ఇరాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి ముస్తఫా అల్ ఖదేమీ అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనేక ఇతర నగరాల్లో అశాంతి తరువాత సైన్యం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించింది.


బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ, ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాగ్ధాద్‌లో పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇరాక్‌లో ఎన్నికలులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని కెర్లిన్ మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొఖ్తదా సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.