Home Page SliderTelangana

ఎయిర్ పోర్ట్ మెట్రోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Share with

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రోపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎయిర్ పోర్ట్ మెట్రో పనులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని, దీనివల్ల రియల్టర్లకే లాభం కలుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆ మార్గంలో ఓఆర్‌ఆర్ ఉన్నందున, మెట్రోకి అంత ప్రాముఖ్యత లేదన్నారు. దానికంటే లక్డీకపూల్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జేబీఎస్ నుండి ఫలక్‌నుమా కారిడార్ పూర్తి చేయడం వల్ల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దానిని పహాడీ షరీఫ్ నుండి ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.