నేడు వరంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
టిజి: పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. అక్కడ టెక్స్టైల్స్ పార్క్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సందర్శన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7.20 గంటలకు తిరిగి హైదరాబాద్కు వస్తారు.