Home Page SliderTelangana

ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఛార్జ్ షీటు దాఖలు

Share with

తెలంగాణాలో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ఇవాళ ఛార్జ్ షీటు దాఖలు చేశారు. కాగా ఫోన్ ట్యాంపింగ్‌పై మార్చి 10న పోలీసులు FIR నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు పోలీసు అధికారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు బృందం ఈ కేసులో మరో ఆరుగురుని నిందితులుగా చేర్చినట్లు సమాచారం.