Home Page SliderTelangana

తెలంగాణా ఎంసెట్ షెడ్యూల్‌లో మార్పులు

Share with

తెలంగాణాలో మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరగాల్సివుంది. అయితే ఈ పరీక్ష తేదీలలో మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా ప్రకటించింది. కాగా మే 12 నుంచి 14 వ తేది వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్,TSPSC పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. అయితే ఈ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకేనని ..మే 10,11 వ తేదీలలో అగ్రికల్చర్ పరీక్షను యధాతధంగా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల 4వ తేదీతో ముగియనుంది. కాగా మే2 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చెసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.