Andhra PradeshHome Page Slider

రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్‌లో చూడడమే చంద్రబాబు విజన్

Share with

మంగళగిరి: ఏపీని నంబర్ వన్‌గా నిలపడమే చంద్రబాబు విజన్ అని, ఆయన ఏనాడూ హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి పీఈపీఎల్ టవర్స్ అపార్ట్‌మెంట్ వాసులతో శుక్రవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రపూరిత రాజకీయాలతో జగన్ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేశారని, ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టే వారికే మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారన్నారు. జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి రాజధానిగా అంగీకరించారు, తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు.