Home Page SliderNational

కేంద్రమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

Share with

టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రమంత్రి జైశంకర్‌కు తాజాగా లేఖ రాశారు. కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన ఏపీ వాసీ రాజేశ్ కోసం చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా ఏపీలోని అద్దంకికి చెందిన రాజేశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే రాజేశ్ ఇటీవల తన భార్య,పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని జౌక్సన్‌విల్లే బీచ్‌కు వెళ్లారు. అక్కడ అలలు వస్తున్న సమయంలో రాజేశ్ కుమారుడు అలల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో కొడుకును కాపాడేందుకు రాజేశ్ వెళ్లగా..అలల దాటికి సముద్రంలో కొట్టుకుపోయి మరణించారు. ఈ నేపథ్యంలో రాజేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రమంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.