Andhra PradeshHome Page Slider

కేంద్రఎలక్షన్ కమీషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలి..టీడీపీ ఎంపీ

Share with

టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, దీనిని కేంద్ర ఎలక్షన్ కమీషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి, పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు. లేనిపోని ఆరోపణలతో బోగస్ ఓట్లు అని పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉంటున్న వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. నేడు ఎన్నికల సంఘం అధికారులను కలిసారు టీడీపీ ఎంపీలు. ఏపీలో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని, ప్రభుత్వ అధికారులే దగ్గరుండి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము సక్రమంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని, కుట్రలతో, కుతంత్రాలతో వారి వ్యక్తులకే ఓట్లు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రజాస్వామ్యానికి న్యాయం చేయాలని, నిజమైన ఓటర్లు వారి ఓటును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.