Home Page SliderNational

‘ఆదిపురుష్’ సినిమాను ఫ్రీగా చూడొచ్చా?

Share with

హీరో ప్రభాస్ శ్రీరామునిగా నటించిన పాన్ ఇండియా మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి. వేల కొద్దీ టికెట్లు కొని, పేదలకు ఉచితంగా ఈ సినిమా చూపించడానికి ఉత్సాహపడుతున్నారు కొందరు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పదివేల టికెట్లు కొని, ముంబై వాడల్లోని పిల్లలకు ఈ చిత్రాన్ని చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలుగులో కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టికెట్లు కొన్నారని సమాచారం. రామ్ చరణ్ కూడా ఇలాగే చేస్తున్నట్లు ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తెలిసింది.

ఈ చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. వినూత్న రీతిలో దాదాపు పదివేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రతీ థియేటర్‌లో ఒక సీటును భగవాన్ హనుమాన్ కోసం కేటాయిస్తున్నట్లు కూడా చిత్రయూనిట్ తెలిపింది. ఈ నమ్మకం వర్కవుట్ అయితే ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని వందల కోట్లు సంపాదించి పెడుతుందని నమ్ముతున్నారు. ఈ రకంగా ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.