Home Page SliderTelangana

చివరి దశకు మంత్రివర్గ విస్తరణ

Share with

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లే అవకాశముంది.