News AlertTelangana

విద్యార్థులపైకి బస్సు… ఒకరు మృతి  

Share with

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి ఒక్క సారిగా స్కూలు బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెదిరిపోయిన బస్సు డైవర్ వెంటనే బస్సు దిగి అక్కడినుండి పారిపోయాడు. ప్రమాద ఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీమున్నీరయ్యారు. న్యాయం చేయాలంటూ రొడ్డుపై బైఠాయించారు. బస్సు డైవర్ అజాగ్రత్త వల్లే ఈ దారుణం జరిగినట్టు అక్కడి స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. డైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.