Home Page SliderTelangana

యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్‌ఎస్ పార్టీ: ఎంపీ లక్ష్మణ్

Share with

హైదరాబాద్: తెలంగాణ వస్తే కొలువులొస్తాయని.. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట మార్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

   వివిధ శాఖల్లో దాదాపు 3 లక్షల ఖాళీలు ఉన్నా రిక్రూట్‌మెంచ్ లేదు. టీచర్ల ఖాళీలు నింపకుండా ఉన్న కారణంగా స్కూల్స్‌  క్లోజ్ అవుతున్నాయి. ఇటీవల నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై బీజేపీ నిరసన వ్యక్తం చేస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, వందేభారత్ రైళ్లు, నూతన హైవేలు, ఎయిమ్స్ ఇలా ఎన్నో కేంద్ర ప్రభుత్వం చొరవతో సాకారం అయ్యాయి. ఏ పార్టీ ప్రకటించకున్నా.. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.